గుణమే ప్రధానం! (కథ) | Telugu Kadhalu | Moral Stories @multiplewaystogrow
అప్పుడే ఒక సీతాకోకచిలుక ఎగురుకుంటూ వచ్చి గులాబీ మొక్క మీద వాలబోతూ ఆగింది.
'ఆగావేంటి?' అని ప్రశ్నించింది గులాబీ మొక్క.
"నేను అందంగా ఉన్నానా?" అడిగింది సీతాకోకచిలుక.
గులాబీ మొక్క మాటలు సీతాకోకచిలుకలో ఆనందాన్ని కలిగించాయి..
'నా గురించి మల్లె ఏమంటుందో?' అంటూ మల్లె మొక్క దగ్గరకు వెళ్లి అడిగింది.
పక్కనే ఉన్న ముద్దబంతి మొక్కను కూడా తన అందం గురించి అడిగింది.
"గులాబీ, మల్లె చెప్పిన మాటలే నావి కూడా.. నిజంగా చాలా బాగున్నావు నువ్వు!" అంది బంతి మొక్క.
"నీకు నా దిష్టే తగిలేటట్టుంది. అంత బావున్నావు నువ్వు" అంటూ మందారం కూడా సీతాకోకచిలుకను పొగిడింది.
మందారం మాటలకు సీతాకోకచిలుక సమాదానం చెప్పకుండా గట్టిగా నవ్వింది.
"సమాధానం చెప్పకుండా, వెక్కిరింతగా నవ్వుతావే?" అని మందారం కొంచెం కోప్పడుతూ అడిగింది.
"ఆఁ! అవునా?" అంటూ సీతాకోకచిలుక కేసి మొక్కలన్నీ ఆశ్చర్యంగా చూస్తూ అన్నాయి.
తమ తప్పు తెలుసుకున్న ఆ పూల మొక్కలన్నీ సిగ్గుతో తల దించుకున్నాయి.
Comments
Post a Comment